English | Telugu

అప్పుడు రజినీకాంత్, ఇప్పుడు ప్రభాస్.. మహేష్ మాస్టర్ మైండ్!

మహేష్ బాబు (Mahesh Babu) సినీ రంగంలో సూపర్ స్టార్ గా ఎదగడమే కాకుండా.. బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్ తో కలిసి హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో 'AMB సినిమాస్' అనే మల్టీప్లెక్స్ ని స్టార్ట్ చేసి, సూపర్ సక్సెస్ అయ్యారు. 2018లో రజినీకాంత్ '2.0' సినిమాతో ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్.. హైదరాబాద్ సినీ ప్రియులకు బెస్ట్ ఆప్షన్స్ లో ఒకటిగా మారింది.

ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో త్వరలో మహేష్ మరో మల్టీప్లెక్స్ ని హైదరాబాద్ సినీ ప్రియులకు అందించబోతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 'AMB క్లాసిక్' పేరుతో ఈ మల్టీప్లెక్స్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఏడు స్క్రీన్ లతో రూపొందుతోన్న ఈ మల్టీప్లెక్స్, 2026 సంక్రాంతికి ఘనంగా ప్రారంభం కానుందని సమాచారం.

2026 సంక్రాంతికి ప్రభాస్ 'ది రాజా సాబ్', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' వంటి సినిమాలు విడుదల కానున్నాయి. వీటిలో 'రాజా సాబ్' ముందు విడుదలవుతుంది కాబట్టి, దాంతోనే 'AMB క్లాసిక్' ప్రారంభమయ్యే అవకాశముంది. మరి మహేష్ కొత్త మల్టీప్లెక్స్ కి ప్రభాస్ మూవీ ఎలాంటి ఆరంభాన్ని ఇస్తుందో చూడాలి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.