English | Telugu

ఎన్టీఆర్ ఔట్‌.. బ‌న్నీ ఇన్‌


శ్రీ‌మంతుడుతో కొర‌టాల శివ‌కు డిమాండ్ బాగా పెరిగింది. సెన్సిబుల్ స్టోరీస్‌ని క‌మ‌ర్షియ‌ల్ పంథాలో చెప్ప‌గ‌ల‌డు అని ఈ సినిమాతో నిరూపించుకొన్నాడు కొర‌టాల‌. దాంతో అగ్ర హీరోలంతా కొర‌టాల‌పై దృష్టి పెట్టారు. శ్రీ‌మంతుడు త‌ర‌వాత కొర‌టాల ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సింది. ఈ సినిమాని మైత్రీ మూవీస్ నిర్మించ‌నుంది. అయితే.. ఇప్పుడు స‌డ‌న్‌గా ఎన్టీఆర్ ప‌క్క‌కు వెళ్లిపోయాడు. ఆ స్థానంలో అల్లు అర్జున్ వ‌చ్చాడ‌ని వినికిడి. బ‌న్నీకి కొర‌టాల ఇది వ‌ర‌కే ఓ క‌థ వినిపించాడు. ఎందుక‌నో.. ఆ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌లేదు.

శ్రీ‌మంతుడు విజ‌యంతో కొర‌టాల‌పై బ‌న్నీకి న‌మ్మ‌కం బాగా పెరిగింది. అందుకే కొర‌టాలని పిలిచి 'మ‌నం సినిమా చేసేద్దాం' అన్నాడ‌ట‌. దాంతో ఈ ప్రాజెక్టు కాస్త ఓకే అయిపోయింది. సుకుమార్ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కూ ఎన్టీఆర్ ఖాళీ అవ్వ‌డు. ఈలోగా బ‌న్నీతో సినిమా చేసేద్దామ‌ని కొర‌టాల ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం. అటు బోయ‌పాటి శ్రీ‌ను, ఇటు కొర‌టాల శివ‌.. ఈ రెండు సినిమాల్నీ స‌మాంత‌రంగా పూర్తి చేయాల‌ని బ‌న్నీ ఆలోచ‌న‌ల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇంకొద్ది రోజుల్లో ఈ విష‌యంపై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.