English | Telugu

ఆ కేరళ నిర్మాత గర్ల్ ఫ్రెండ్ ఆత్మహత్య..!

కొద్ది రోజుల క్రితం తన సినిమా రషెస్ చూసి మళయాళ నిర్మాత, నటుడు అజయ్ కృష్ణన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎవరూ మర్చిపోక ముందే, మరో దుర్ఘటన చోటు చేసుకుంది. అజయ్ గర్ల్ ఫ్రెండ్ వినీతా నాయర్ తన అపార్ట్ మెంట్ లో సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన లేఖ రాసి పెట్టింది. అజయ్ మరణాన్ని భరించడం తనవల్ల కావడం లేదని, ఆ ఒత్తిడిని భరించలేకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నానని, లేఖలో రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంది. 28 ఏళ్ల వినీత ఫాషన్ డిజైనింగ్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. సాక్ష్యాధారాలను నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మళయాళ సినీ పరిశ్రమకు ఈ సూసైడ్ లు దిగ్భ్రాంతి కలిగించాయి. పలువురు మళయాళ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.