English | Telugu

వాట్సాప్ గ్రూప్ లో కత్రినాను తొలగించారట..!

కత్రినా కైఫ్ కు రణ్ బీర్ కు కటీఫ్ అయిపోయినా, మళ్లీ వాళ్లిద్దరూ ఎప్పుడో ఒకప్పుడు కలుస్తారని బాలీవుడ్ జనాలు భావించారు. కానీ రీసెంట్ గా జరిగిన విషయం బట్టి చూస్తే, ఇద్దరూ తమ గతాన్ని మర్చిపోయి జీవితం ముందుకు సాగిపోవాలనుకుంటున్నారని అర్ధమవుతుంది. తాజాగా వీళ్లిద్దరికి సంబంధించి బాలీవుడ్లో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. కపూర్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్ ఉందట. రణ్ బీర్ తో పెయిర్ అప్ అయిన తర్వాత కత్రినాను ఈ గ్రూప్ లో యాక్సెప్ట్ చేశారు. ఇన్నాళ్లూ వీళ్లిద్దరూ మళ్లీ కలుస్తారనే థాట్ తో ఇప్పటి వరకూ ఆమెను గ్రూప్ నుంచి తొలగించలేదు. కానీ తాజాగా గ్రూప్ అడ్మిన్ గా ఉన్న రణ్ బీర్ అత్త రీతూ నందా, కత్రినాను తొలగించిందట.

ఇన్నాళ్లూ ఈ గ్రూప్ కు దూరంగా రిషీ కపూర్, కత్రినాను తొలగించిన తర్వాత గ్రూప్ లోకి యాడ్ అయ్యాడట. దీంతో వీళ్లిద్దరి బ్రేకప్ పరిపూర్ణమైందంటూ బాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు. నిజానికి 2016 చివర్లో కత్రినాను పెళ్లి చేసుకుంటానని రణ్ బీర్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇక్కడే ఇద్దరి మధ్యా విభేదాలొచ్చాయట. కాస్త సెటిల్ అయ్యాక పెళ్లి సంగతి చూద్దామని కత్రినా అంటుంటే, రణ్ బీర్ మాత్రం ఇక సినిమాలు వద్దు అంటున్నాడట. ఈ విషయమై ఇద్దరి మధ్యా విభేదాలు బ్రేకప్ వరకూ దారితీశాయి. రణ్ బీర్ తల్లిదండ్రులకు కూడా కత్రినా తమ కోడలిగా ఇష్టం లేదనే పుకారు కూడా ఉంది. తాజా న్యూస్ తో వాళ్ల బ్రేకప్ కన్ఫామ్ అయిపోయింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.