English | Telugu

హీరో కార్తీ గురించి నిజాలు బయటపెట్టిన ప్రముఖ నటి!

ఇటీవల జరిగిన 'సత్యం సుందరం' మూవీ ఈవెంట్ లో.. ఒక మీమ్ చూపిస్తూ "లడ్డు కావాలా నాయనా..?" అని యాంకర్ అనగా.. దానికి స్పందించిన హీరో కార్తీ (Karthi) నవ్వుతూ "ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్ అది. మనకొద్దు." అన్నాడు. దాంతో ఆ ఈవెంట్ లో ఉన్నవారు నవ్వేశారు. అయితే కార్తీ చేసిన కామెంట్స్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేశారు. "లడ్డు మీద మీరు జోకులేయడం కరెక్ట్ కాదు. సనాతన ధర్మం గురించి మాట్లాడేముందు ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడండి" అని పవన్ అన్నారు. దాంతో వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందించిన కార్తీ.. క్షమాపణలు చెప్పడమే కాకుండా, తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడినని చెప్పుకొచ్చాడు. కార్తీ అలా వెంటనే స్పందించి, క్షమాపణలు చెప్పడంతో ఆయనపై ప్రశంసలు కురిశాయి. అయితే సీనియర్ నటి కస్తూరి (Kasturi) మాత్రం.. కార్తీ కుటుంబానికి ఇటువంటి కామెంట్స్ చేయడం అలవాటే అంటూ అసలు మేటర్ బయట పెట్టేశారు.

కార్తీ లడ్డు వివాదంపై నటి కస్తూరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "పవన్ కళ్యాణ్ గారి వార్నింగ్ తర్వాత, కార్తీ వెంటనే క్షమాపణలు చెప్పాడు. తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడినని చెప్పుకొచ్చాడు. కార్తీకి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమా విడుదలకు సిద్ధమైంది. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకు చెప్పాడో.

అసలు ఏం జరిగింది అంటే.. సత్యంసుందరం సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో లడ్డూ మీమ్‌ని తీసుకొచ్చారు. అసలు ఈవెంట్ రైటర్, డైరెక్టర్, యాంకర్ ఏమి అనుకుంటున్నారో. వాళ్ళకి ఇది జోక్‌గా ఉందనుకుంటా?. కార్తీ ఈ దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు, కానీ ఫెయిల్ అయ్యాడు.

యాంకర్ మూర్ఖంగా వ్యవహరించింది. ఇలాంటి వాటిలో హాస్యం వద్దని.. యాంకర్ ని కార్తీ హెచ్చరిస్తే బాగుండేది. కానీ యాంకర్‌ను నొప్పించకుండా జోక్ తో అవాయిడ్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ చర్య చాలా మందిని బాధపెట్టింది.

సనాతన పద్ధతులపై కార్తీ కుటుంబం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వడం ఇదే మొదటిసారి కాదు. శబరి మాలపై శివకుమార్ సర్ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే, జ్యోతిక ఆలయ వ్యతిరేక వ్యాఖ్య లు తీవ్ర దుమారం రేపాయి.

తంజావూరు బృహదీశ్వరాలయం లేదా శబరిమల గురించి మాట్లాడి తప్పించుకోవచ్చు. తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులతో మీరు చెలగాటమాడలేరు. హిందూ వ్యతిరేకత ఆంధ్రాలో స్వాగతించబడదు. ఓం నమో వేంకటేశాయ." అంటూ కస్తూరి వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

అయితే కస్తూరి ట్వీట్ పై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెకి సపోర్ట్ గా మాట్లాడుతుండగా.. మరికొందరు మాత్రం అప్పట్లో కార్తీతో కస్తూరి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా అసహనం వ్యక్తం చేశాడు. అందుకే ఇప్పుడామె కార్తీని టార్గెట్ చేసిందని కామెంట్ చేస్తున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.