English | Telugu

అక్టోబర్‌ 10న షేర్ ఆడియో..30న సినిమా!!

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షేర్‌. ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌ 10న విడుదల చేస్తున్నారు. అలాగే చిత్రాన్ని అక్టోబర్‌ 30న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాత కొమర వెంకటేష్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా..

నిర్మాత కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ.. మా సినిమాకి సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ టోటల్‌గా కంప్లీట్‌ అయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ 30న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌ 10న హైదరాబాద్‌లోని పార్క్‌ హయాత్‌ హోటల్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. ఈ ఆడియో ఫంక్షన్‌కి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియోను ఆవిష్కరించబోతున్నారు. మా చిత్రానికి థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. డైరెక్టర్‌ మల్లికార్జున్‌ టేకింగ్‌ చాలా అద్భుతంగా వుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. పటాస్‌ తో సూపర్‌హిట్‌ సాధించిన కళ్యాణ్‌రామ్‌గారికి షేర్‌ మరో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది.. అన్నారు.

దర్శకుడు మల్లికార్జున్‌ మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌గారి కెరీర్‌లో మరో సెన్సేషనల్‌ మూవీ అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌గారి పెర్‌ఫార్మెన్స్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంటుంది. థమన్‌ సూపర్‌హిట్‌ సాంగ్స్‌ని చేశారు. ఆడియో కూడా పెద్ద హిట్‌ అవుతుంది.. అన్నారు.

నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.