English | Telugu

బుడ్డోడికి కోపం వ‌చ్చింది..అందుకే రియాక్ట్ అయ్యాడు

నంద‌మూరి ఫ్యామిలీలో ఉన్న లుక‌లుక‌ల్ని ప్ర‌త్యేకంగా గుర్తు చేయ‌న‌వ‌స‌రం లేదు. నంద‌మూరి కుటుంబానికి సంబంధించిన సినీ వేడుక‌ల్లో ఈ విష‌యం బ‌హిర్గ‌తం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఉన్న వేడుక‌ల్లో.. మ‌రీ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటుంది. వేదిక‌పై ఎన్టీఆర్ ఉన్నా, జై బాల‌య్యా.. జై జై బాల‌య్య అంటూ బాల‌కృష్ణ‌ని అభిమానులు స్మ‌రిస్తుంటారు. అది.. ఎన్టీఆర్ కి కోపం తెప్పిస్తుంది. షేర్ ఆడియో వేడుక‌పై ఇదే దృశ్యం ఆవిష్ర్కృత‌మైంది.

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ న‌టించిన షేర్ ఆడియో ఫంక్ష‌న్‌కి ఎన్టీఆర్ హాజ‌ర‌య్యాడు. అక్క‌డ వంద‌లాదిగా త‌ర‌లివ‌చ్చిన బాల‌య్య అభిమానులు జై బాల‌య్య‌.. జై జై బాల‌య్య అంటూ ప‌దే ప‌దే గ‌ట్టిగా అర‌వ‌డం.. ఎన్టీఆర్‌కి చిరాకు తెప్పించింది. ఓ ద‌శ‌లో స‌డ‌న్‌గా మైకు అందుకొని.. `ఇది మ‌న ఫంక్ష‌న్ కాదు.. అభిమానులు శాంతించాలి` అంటూ కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ ఫ్యాన్స్ విన‌లేదు. స‌రి కదా, ఆ ఆరుపులు మ‌రింత ఎక్కువ‌య్యాయి. దాంతో ఎన్టీఆర్ మొహం చిన్న‌బుచ్చుకొన్నాడు.

అందుకే క‌ల్యాణ్‌రామ్ మాట్లాడుతూ అభిమానులు త‌మ‌ని వేరు చేసి మాట్లాడ‌డం భావ్యం కాద‌ని సూచించాడు. త‌మ దైవం ఎన్టీఆరే అని, వాళ్ల వార‌సుల్ని కూడా స‌మానంగా చూడాల‌ని గుర్తు చేశాడు. క‌ల్యాణ్ రామ్ వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లోనే కాదు, అటు టీడీపీలోనూ చ‌ర్చ‌నీయాంశాల‌య్యాయి. బాల‌య్య‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌డానికి ఎన్టీఆర్ అన్న‌య్య త‌రుపునుంచి ఇలా మాట్లాడించాడా? అని కూడా భావిస్తున్నారు. ఫ్యాన్స్ మ‌ధ్య చీలిక‌లొస్తే అది త‌న కెరీర్ కే మంచిది కాద‌ని ఎన్టీఆర్ భావిస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. అందుకే.. ఫ్యాన్స్ ని కూల్ చేయ‌డానికి క‌ల్యాణ్ రామ్ చేత ఇలా మాట్లాడించాడ‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి బాల‌య్య ఫ్యాన్స్ ఇప్పటికైనా ఎన్టీఆర్‌ని క‌రుణిస్తారా?? మ‌ళ్లీ హీరోలంతా ఏక‌మ‌వుతారా? ఈ ప్ర‌శ్న‌ల‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.