English | Telugu

కబాలీ చూసి పడిపోయిన రాజమౌళి..!

నిన్న నెట్టింట్లో కబాలీ టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ టీజర్లకు విపరీతమైన స్పందన వస్తోంది. వరల్డ్ వైడ్ రజనీ ఫ్యాన్స్ కబాలీ సినిమా తమకు పండగే అని ఫిక్సై పోయారు. కబాలీ రా..అంటూ రజనీ చెప్పిన డైలాగ్ కు ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయారు. దర్శక బాహుబలి రాజమౌళి అయితే తన ట్విట్టర్లో కబాలీని ఆకాశానికెత్తేశారు. రజనీ అంటే ఇది..స్టైల్ అంటే ఇది, తలైవా అంటే ఇది అంటూ ట్వీట్ చేశాడు జక్కన్న.

రిలీజ్ చేసిన కొద్ది సేపట్లోనే వరల్డ్ వైడ్ ట్రెండింగ్ టాపిక్స్ లో చెలరేగిపోయాడు కబాలీ. బాలీవుడ్ నుంచి మల్లూవుడ్ వరకూ రజనీ టీజర్ కు భారీగా స్పందన వస్తోంది. పా రంజిత్ తెరకెక్కించిన కబాలీని కలైపులి ఎస్ థాను నిర్మించారు. మలేషియాలో ఉండే ఒక స్టైలిష్ డాన్ గా రజనీ గెటప్, డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటూ సినిమాపై అంచానలు పెంచేశాయి. వయసు మీద పడినా, స్టైల్ ను మెయింటెయిన్ చేయడం రజనీకి మాత్రమే చెల్లింది. రజనీ సరసన రాధికా ఆప్టే నటించగా, నాజర్, దినేష్ రవి, ధన్సిక ముఖ్యపాత్రలు పోషించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.