English | Telugu

జ్యోతిల‌క్ష్మి స‌గం ఊడ్చేసింది

వేశ్య‌గా ఛార్మి, జ్యోతిల‌క్ష్మిలాంటి మాంచి మాస్ టైటిల్ - పూరి ద‌ర్శ‌కుడు, నిర్మాత‌గా ఛార్మి! ఓ సినిమా జ‌నం దృష్టిలో ప‌డ‌డానికి ఇంకేం కావాలి. పైగా పోస్ట‌ర్లు, టీజ‌ర్లు కూడా క‌వ్వించేలానే ఉన్నాయి. దాంతో జ్యోతిల‌క్ష్మి ఇర‌గాడేస్తుంది అనుకొన్నారంతా. తొలి రోజు ఓ మాదిరి వ‌సూళ్లు ద‌క్కించుకొన్న జ్యోతిల‌క్ష్మి... ఆ త‌ర‌వాత పూర్తిగా ప‌డిపోయింది.

ఆంధ్ర‌, నైజాం, సీడెడ్‌.. ఎక్క‌డా త‌గిన‌న్ని వ‌సూళ్లు రాబ‌ట్టుకోలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాని ఇన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డం ఓ రికార్డ్‌... అంటూ ఊద‌ర‌గొట్టిన చిత్ర‌బృందం ఈసినిమా వ‌సూళ్లు చూసి బేర్‌మంది. మూడ్రోజుల త‌ర‌వాత‌.. జ్యోతిల‌క్ష్మి ద‌గ్గ‌ర ప్రేక్ష‌కులే క‌రువ‌య్యారు. 'ఇది ఫ్యామిలీ సినిమా', 'ఆడాళ్ల‌పై మీకు ఏమాత్రం గౌర‌వం ఉన్నా చూడాల్సిందే' అని ప్ర‌చారంతో జ‌నాల్ని, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌నీ థియేట‌ర్ల‌కు రప్పించాల‌న్న ప్ర‌య‌త్నాలూ ఫ‌లించ‌లేదు. ఈ సినిమాని రూ.15 కోట్ల‌కు అమ్ముకొంది టీమ్‌.

అయితే అందులో స‌గం డ‌బ్బులూ రాలేదు. పంపిణీదారులు 'మేం న‌ష్ట‌పోయాం.. డ‌బ్బులు క‌ట్ట‌లేం' అంటూ అడ్డుప‌డుతున్నార‌ట‌. దాంతో పూరి అండ్ టీమ్‌కి ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. మొత్తానికి జ్యోతిల‌క్ష్మి వ‌ల్ల ఛార్మి, పూరి బాగుప‌డ్డారేమో గానీ, సినిమా కొన్న‌వాళ్లంతా స‌గానికి స‌గం పోగొట్టుకొన్నార‌ని ట్రేడ్ టాక్‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.