English | Telugu

జంగిల్ బుక్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న డిస్నీ...!

ఈ మధ్యే రిలీజైన జంగిల్ బుక్ ఏ స్థాయిలో హిట్ అయ్యిందో తెలిసిందే. ఒక్క ఇండియన్ మార్కెట్ లోనే వందకోట్లకు పైగా కొల్లగొట్టిందీ సినిమా. రికార్డ్ స్థాయిలో వరల్డ్ వైడ్ హిట్ కొట్టిన జంగిల్ బుక్ కు త్వరలోనే సీక్వెల్ స్టార్ట్ చేస్తామని వాల్ట్ డిస్నీ నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇదే కాక ఏంజెలీనా జోలీ లీడ్ రోల్ పోషించిన మెలిఫిషెంట్, మేరీ పాప్పిన్స్ సినిమాలకు సీక్వెల్ తీయబోతున్నామని కన్ఫామ్ చేసింది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన జాన్ ఫేవర్యూనే రెండో పార్ట్ కు కూడా దర్శకత్వం వహించబోతున్నారు. సినిమా రిలీజ్ డేట్ ను 2019గా ప్రకటించాలని డిస్నీ సంస్థ భావిస్తున్నా, అప్పటికి సినిమా పూర్తి కాకపోతే మళ్లీ మార్చే అవకాశం ఉందంటున్నారు. 1984 లో రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన జంగిల్ బుక్ నవల ఆ తర్వాత యానిమేషన్ టెలీ సీరియల్ గా ప్రసారమై విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ కథాంశాన్నే తీసుకుని, డిస్నీ సంస్థ, లైవ్ యాక్షన్ ఏనిమేషన్ మూవీగా జంగిల్ బుక్ ను తెరకెక్కించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ కొట్టింది. లీడ్ రోల్ మోగ్లీగా భారతీయ సంతతికి చెందిన నీల్ సేథి నటించడం విశేషం.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.