English | Telugu

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి దొరికిపోయిన బాబు

బాల‌కృష్ణ - ఎన్టీఆర్ ల మ‌ధ్య న‌డుస్తున్న కోల్డ్ వార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లెద్దు. ఒక‌రిపై ఒక‌రు ప‌రోక్షంగానే.. సై అంటే సై అంటూ... స‌వాళ్లు విసురుకొంటున్నారు. వీరిద్ద‌రి సినిమాలు ఇప్పుడు సంక్రాంతి బ‌రిలోఉన్నాయి. అందుకే.. ఎవ‌రి గురించి ఏం మాట్లాడాల‌నుకొన్నా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆ జాగ్ర‌త్త తెలియ‌క జ‌గ‌ప‌తిబాబు అడ్డంగా బుక్క‌యిపోయాడు. నాన్న‌కు ప్రేమ‌తో ఆడియో ఫంక్ష‌న్‌లో.

ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు విల‌న్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే! ఆడియో ఫంక్ష‌న్‌లో జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతున్న‌ప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ 'డైలాగ్‌.. డైలాగ్‌' అంటూ అర‌చి గోల చేశారు. దానికి జ‌గ‌ప‌తిబాబు `ఇది లెజెండ్ సినిమాకాదు.. డైలాగులు చెప్ప‌డానికి` అనేశాడు. ఎన్టీఆర్ ఫంక్ష‌న్‌లో బాల‌య్య సినిమా మాట వినిపించడం అదొక్క‌టే! దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ‌గ్గోలు చేశారు. అంటే జ‌గ‌ప‌తి అభిప్రాయం ఏమిటి?? ఎన్టీఆర్ సినిమాని త‌క్కువ అంచ‌నా వేస్తున్నాడా? బాల‌య్యే గ్రేట్ అని చెప్పాల‌న్న‌ది ఆయ‌న ప్ర‌య‌త్న‌మా? లేదంటే ఇది అలాంటిసినిమా కాద‌న్న‌ది ఉద్దేశ‌మా? అంటూ బాబు గారి డైలాగ్‌కి.. విభిన్న కోణాల్లో అర్థాలు వెదుక్కోసాగారు. అంత‌టితో ఆగ‌లేదు.. డ‌బ్బింగ్ చెప్పేగానీ.. ఈసినిమా ఏమిటో నాకు అర్థం కాలేదు.. అంటూ మ‌రోసారి నోరు జారాడు. నాకోసమైతే ఈ సినిమా చూడొద్దు.. ఎన్టీఆర్ కోసం చూడండి... అంటూ ఏవేవో మాట్టాడాడు. దాంతో ఆడియో ఫంక్ష‌న్‌లో కాస్త గంద‌ర‌గోళం నెల‌కొంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్ష‌న్ జ‌గప‌తిబాబునీ టెన్ష‌న్‌లో పెట్టేసింది. అందుకే గ‌బ‌గ‌బ త‌న స్పీచ్ ముగించేశాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.