English | Telugu

హీరో వేణు తొట్టెంపూడిపై కేసు పెట్టిన మహిళ..!

కొన్నేళ్ల క్రితం కామెడీ చిత్రాలతో అలరించిన వేణు తొట్టెంపూడి ఈ మధ్య వెండితెరకు దూరమయ్యాడు. చివరిగా ఎన్టీఆర్ దమ్ము సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన వేణు ఆ తర్వాత కనిపించలేదు. లేటెస్ట్ గా ఈ నటుడు న్యూస్ లోకెక్కాడు. తాను ఇచ్చిన ఇంటి అడ్వాన్స్ తిరిగివ్వకుండా, తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ ఫాతిమా అనే మహిళ బంజారాహిల్స్ పిఎస్ లో కంప్లైంట్ చేసింది. ఇరానీ డాక్టర్ అయిన ఫాతిమా ఏడునెలల క్రితం బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 10 లో వేణు ఇంటిని అద్దెకు తీసుకుంది. అడ్వాన్స్ గా ఎనభై ఎనిమిది వేలు చెల్లించిన ఫాతిమా, తాను ఇంటిని ఖాళీ చేస్తూ అడ్వాన్స్ తిరిగివ్వాలని వేణు దంపతుల్ని కోరింది. ఆమె అద్దెకు వచ్చిన తర్వాత, ఫ్లోర్ పై బీటలు వచ్చాయని వాటిని బాగుచేయించి అడ్వాన్స్ తీసుకోమని వేణు దంపతులు చెబుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా వేణు దంపతులు ఫాతిమాతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.