English | Telugu

బర్త్ డే రోజు కొడైకెనాల్ లో బిజీగా వున్న నాని

హీరోలుగా ఓ స్టేజ్‌కు ఎదగగానే.. తమను వెండితెరకు పరిచయం చేసిన దర్శకనిర్మాతలనే మరచిపోయే కథానాయకులు ఎందరో..! కానీ తాను మాత్రం ఆ తరహా కథానాయకుడిని కాదంటున్నాడు నాని... అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయమైన నానిని.. ఈ ఏడేళ్ల కాలంలో కొన్ని విజయాలు, మరికొన్ని పరాజయాలు పలకరించాయి. రీసెంట్‌గా ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లాంటి సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు నాచురల్ స్టార్ నాని. గత కొద్ది రోజులుగా నాని కృష్ణగాడి వీర ప్రేమగాథ సక్సెస్ టూర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కాగా నాని పుట్టిన రోజు ఈ రోజు. ఈ రోజు తన బర్త్ డే అయినప్పటికీ తను ఏ మాత్రం ఎంజాయ్ చేయకుండా తన తదుపరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. నాని ప్రస్తుతం తనని అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో తన తదుపరి సినిమా చేస్తున్నాడు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఓ ప్రేమకథకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కామెడీని జతకలిపి ఓ సరికొత్త కథగా ఈ సినిమా కథను దర్శకుడు తీర్చిదిద్దారట. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలు. ఇటీవలే హైదరాబాద్ లో ఫిస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం సెకండ్ షెడ్యూల్ కోసం కొడైకెనాల్ వెళ్ళారు. ఈ రోజు ఉదయం నుంచి షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఈ షెడ్యూల్ మార్చి 6 వరకూ అక్కడే జరగనుంది. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో మిగిలిన షూట్ ని ఫినిష్ చేస్తారు. ఇప్పటికే 40% ఫినిష్ అయిన ఈ సినిమా షూటింగ్ మొత్తం ఏప్రిల్ చివరికల్లా పూర్తవుతుంది. మే చివర్లో సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి ‘ధమాక’ అనే టైటిల్ ని పరిశీలనలో వున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.