English | Telugu

గోపీచంద్ 'లౌక్యం'తో 'లక్ష్యం' చేరుతాడా..!

గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా, శ్రీవాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 'లౌక్యం'. 'లక్ష్యం' తర్వాత శ్రీవాస్, గోపీచంద్ కలయికలో వస్తున్న సినిమా ఇది. నిర్మాణంతర కార్యక్రమాలతో పాటు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. గత కొంత కాలంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న గోపీచంద్ కి ఈ సినిమా తప్పక విజయాన్ని అందిస్తుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. రొటీన్ మాస్ సినిమాలాగా కాకుండా ఓ మంచి కథను ఈ సినిమాను గోపీమోహన్, కోనవెంకట్ అందిచారట. అలాగే బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సినిమాను చూసిన యూనిట్ సభ్యుల్లో ఒకరైన గోపిమోహన్ గారు తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో సినిమా గురించి చెపుతూ "'లౌక్యం' ఫస్ట్ కాపీ చూశాను, ఈ సినిమా గోపిచంద్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది" అని తెలిపారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.