English | Telugu

ప‌వ‌న్ సినిమాకు పిచ్చ క్రేజ్‌

టాలీవుడ్‌లో ముస్తాబ‌వుతున్న మ‌రో క్రేజీ చిత్రం.. గోపాల గోపాల‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ కృష్ణుడు అన‌గానే ఈ సినిమాపై అంచ‌నాలు ఎక్క‌డికో వెళ్లిపోయాయి. పైగా అత్తారింటికి దారేది త‌ర‌వాత వ‌స్తున్న సినిమా ఆయె. అందుకే ఈ సినిమాపై అటు ప్రేక్ష‌కులు ఇటు బ‌య్య‌ర్లు.. మొత్తానికి టాలీవుడ్ అంతా దృష్టి పెట్టింది. ఎప్పుడో సంక్రాంతికి వ‌చ్చే సినిమా ఇది. కానీ అప్పుడే బిజినెస్ మొద‌లైపోయింది. నైజాంలో ఈసినిమా రూ.15 కోట్లు ప‌లుకుతోంద‌ట‌. ఇక్క‌డ అత్తారింటికి దారేది దాదాపుగా రూ.20 కోట్లు వ‌సూలు చేసింది. టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఇదే రికార్డ్‌. అదే భ‌రోసాతో ఈ సినిమాని కొనుక్కోవ‌డానికి బ‌య్య‌ర్లు ముందుకొస్తున్నార్ట‌. మొత్త‌మ్మీద ఈజీగా రూ.50 కోట్ల బిజినెస్ జ‌రిగిపోతుంద‌ని నిర్మాత‌లు లెక్క‌లు వేసుకొంటున్నారు. దాంతో ఈ సినిమా విడుద‌ల‌కు ముందే లాభాల్ని సంపాదించిన‌ట్టైంది. ఎందుకంటే.. ఈ సినిమాకి ఇద్ద‌రు నిర్మాత‌లు. ఒక‌రు డి.సురేష్‌బాబు, ఇంకొక‌రు శ‌ర‌త్ మ‌రార్‌. సురేష్‌బాబు వెంకీనీ, శ‌ర‌త్ మ‌రార్ ప‌వ‌న్‌నీ పెట్టుబ‌డిగా వాడుకొంటున్నారు. వీరిద్ద‌రి పారితోషికాలు మిన‌హాయిస్తే ఈ సినిమాకి రూ.15 కోట్లు కూడా ఖ‌ర్చు కావు. సో.. రూ.35 కోట్లు మిగులున్న‌మాట‌. ఇంకా ఓవ‌ర్సీస్ హ‌క్కులు, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోలేదు. సో.. వాటి ద్వారా వ‌చ్చిన‌దంతా ఈ ప్రొడ్యూస‌ర్ల ఖాతాకే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.