English | Telugu

రాజ్‌ తరుణ్‌కి హైకోర్టులో ఊరట.. ఓడిపోయిన లావణ్య!

గత కొన్ని రోజులుగా రాజ్‌తరుణ్‌, లావణ్య మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. పెళ్ళి చేసుకొని ఇప్పుడు మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడని, ఈ విషయంలో తనను మోసం చేశాడని నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు వెలుగులోకి వచ్చి నెలరోజులు దాటిపోయింది. ఆరోజు నుంచి ఈరోజు వరకు డైలీ సీరియల్‌లో ఉండే ట్విస్టులను మించిన ట్విస్టులు ఈ వివాదంలో ఉండడంతో రోజుకో మలుపు తిరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే రాజ్‌ తరుణ్‌ తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టును కోరారు.

ముందస్తు బెయిల్‌కి సంబంధించిన విచారణ గురువారం జరిగింది. 30కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న తన క్లయింట్‌ రాజ్‌ తరుణ్‌ ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ తప్పుడు కేసును పెట్టారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. తనను రాజ్‌ తరుణ్‌ పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్న లావణ్య ఈరోజు వరకు దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని రాజ్‌ తరుణ్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఈ విషయాలను పరిశీలించిన న్యాయమూర్తి.. రాజ్‌ తరుణ్‌కు రూ.20 వేల పూచీకత్తుతో ముందస్తు బెయిల్‌ను మంజూరు చేశారు.

ఈ కేసుకు సంబంధించి రాజ్‌ తరుణ్‌ను విచారించాలి తప్ప అరెస్ట్‌ చేయరాదని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. రాజ్‌ తరుణ్‌ కూడా విచారణకు సహకరించాలని న్యాయమూర్తి సూచించారు. ఇప్పటివరకు మీడియాలో, సోషల్‌ మీడియాలో ఈ కేసుతో సంబంధం ఉన్నవారు, సంబంధం లేని వారు కూడా రకరకాలుగా వాదనలు చేశారు. ఈమధ్యకాలంలో అత్యంత సంచలనంగా మారిన రాజ్‌ తరుణ్‌, లావణ్య కేసు కాస్త ముందుకు వెళ్లింది. రాజ్‌ తరుణ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరైన నేపథ్యంలో లావణ్య ఎలా స్పందిస్తుందో చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.