English | Telugu

విజయ్ పోలీసోడు ఈవారమే వస్తున్నాడు..!

ఇళయదళపతి విజయ్ కొత్త మూవీ తేరీ తెలుగులో పోలీసోడుగా రాబోతున్న విషయం తెలిసిందే. తమిళంలో ఇప్పటికే సూపర్ క్రేజ్ తో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను తెలుగులో రిలీజ్ చేసే బాధ్యత దిల్ రాజు తీసుకున్నారు. తెలుగులో సూపర్ హిట్టయిన రాజారాణిని తెరకెక్కించిన అట్లీ దర్శకుడు. సర్దార్ రిలీజ్ కు ముందు ఆ ప్రభంజనంలో పోలీసోడిని పోస్ట్ పోన్ చేద్దామా అని రాజు సందేహించారు. కానీ సర్దార్ కు మిక్స్ డ్ టాక్ రావడంతో, పోలీసోడిని ఈ వారం రిలీజ్ చేసేయడానికే ఫిక్స్ అయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మాట్లాడుతూ, త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నానని, ఇప్పటికే రాజారాణిని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించారని, పోలీసోడిని కూడా ఆదరిస్తారనుకుంటున్నా అన్నారు. నెలరోజుల క్రితం చెన్నై వెళ్లినప్పుడు తేరీ పాటలు, ప్రోమోలు చూసి, మంచి సినిమా అవుతుందని అనుకున్నానని, ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందన్నారు దిల్ రాజు. పోలీస్ గెటప్ లో పవన్ నిరాశ పరిచిన నేపథ్యంలో, ఇప్పుడు పోలీసోడు ఏం చేస్తాడో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.