English | Telugu

అమరావతిలో ‘డిక్టేటర్’ ఆడియో విడుదల

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన ‘డిక్టేటర్’ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా ఆడియో సీడీని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవిష్కరించి తొలి సీడీని కథానాయకుడు బాలకృష్ణకు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు బాలకృష్ణ 99వ చిత్రమైన ‘డిక్టేటర్’ ఘన విజయాన్ని సాధించాలని కోరుకున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.