English | Telugu

డివైడ్ టాక్ తోనూ కలెక్షన్ల సునామీ.. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తున్న కూలీ!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన చిత్రం 'కూలీ'. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ.. డివైడ్ టాక్ వచ్చినా, పోటీగా 'వార్-2' ఉన్నా.. సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.

మొదటి రోజు రూ.151 కోట్ల గ్రాస్ రాబట్టి తమిళ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన కూలీ.. తాజాగా మరో ఘనత సాధించింది. నాలుగు రోజుల్లోనే రూ.404 కోట్లు కలెక్ట్ చేసి.. తమిళ సినీ చరిత్రలో వేగంగా 400 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా నిలిచింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ.600 కోట్ల గ్రాస్ దాకా రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్నప్పటికీ.. నిజానికి 'కూలీ'పై నెలకొన్న హైప్ కి ఇంకా వండర్స్ క్రియేట్ చేయాల్సింది. కానీ, పోటీగా 'వార్-2' ఉండటం, సినిమాకి డివైడ్ టాక్ రావడం, వర్షాల ప్రభావం.. వంటి కారణాల వల్ల 'కూలీ' కలెక్షన్ల సునామీ ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయాలున్నాయి. లేదంటే ఈ సినిమా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసేదనే అంచనాలు ఉన్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.