English | Telugu
'క్రాక్' సినిమాటోగ్రాఫర్ పెళ్లి.. మెరిసిన కీర్తి సురేశ్, వరలక్ష్మి!
Updated : Apr 27, 2021
క్రాక్, బిగిల్, మెర్సాల్ సినిమాల సినిమాటోగ్రాఫర్ జి.కె. విష్ణు ఓ ఇంటివాడయ్యాడు. సంప్రదాయ పద్ధతిలో ఆదివారం జరిగిన వేడుకలో మహాలక్ష్మి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్ హాజరయ్యారు.
విష్ణుకు సన్నిహితులైన జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్, క్రాక్లో జయమ్మ పాత్రతో అందర్నీ ఆకట్టుకున్న వరలక్ష్మి శరత్కుమార్, క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు అందజేశారు. చెన్నైలోని ఓ వెడ్డింగ్ హాల్లో సింపుల్గా, కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ పెళ్లి జరిగింది. కీర్తి సురేశ్, వరలక్ష్మి ఇద్దరూ గార్జియస్ లుక్స్లో మెరిసిపోయారు. అక్కడ ఉన్నంత సేపూ మాస్క్లు ధరించే కనిపించారు.
ఈ వేడుకకు సంబంధించిన కొన్ని పిక్చర్స్ను వరలక్ష్మి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. వాటితో పాటు, "#weddingvibes #S2gals #sarkar #sandakozhli2 @KeerthyOfficial and my darling #krack super star @megopichand #vishnuwedsmaha dop_gkvishnu " అంటూ రాసుకొచ్చింది.
జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసిన మూడు సినిమాలు అతనికి చాలా మంచి పేరు తెచ్చాయి. డైరెక్టర్ అట్లీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయ్ సినిమా 'మెర్సాల్'కు సూపర్బ్ విజువల్స్ ఇచ్చాడు విష్ణు. ఆ తర్వాత మరోసారి అదే కాంబినేషన్తో 'బిగిల్' చేశాడు. తెలుగులోనూ ఆ సినిమా బాగా ఆడింది. దాంతో గోపీచంద్ మలినేని దృష్టిలో పడి రవితేజ సినిమా 'క్రాక్'కు పనిచేశాడు. అందులో అతని కెమెరా పనితనం ఎలా ఉందో మనం చూశాం. ఇప్పుడు సెట్స్ మీద ఉన్న రవితేజ సినిమా 'ఖిలాడి'కి కూడా అతడే సినిమాటోగ్రాఫర్.
