English | Telugu

రూ. 100 కోట్ల క్ల‌బ్బులో 6 సినిమాలు.. టాలీవుడ్ నుంచి ఒకే 'ఒక్క‌డు'!

రూ. 100 కోట్ల క్ల‌బ్బులో 6 సినిమాలు.. టాలీవుడ్ నుంచి ఒకే 'ఒక్క‌డు'!

 

టాలీవుడ్‌లో అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న టాప్ స్టార్స్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఒకరు. ఆయ‌న కెరీర్‌లో ప‌లు సూప‌ర్‌హిట్‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ ఉన్నాయి. రెండు ద‌శాబ్దాల‌కు మించిన కెరీర్‌లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌లు రికార్డుల‌ను ఆయ‌న నెల‌కొల్పాడు. టాలీవుడ్ హీరోల్లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ. 100 కోట్ల‌కు మించి వ‌సూలు చేసిన సినిమాల్లో రికార్డు ఆయ‌న‌దే. ఐఎండీబీ ప్ర‌కారం ఆయ‌న ఖాతాలో రూ. 100 కోట్లు వ‌సూలు చేసిన సినిమాలు ఆరు ఉన్నాయి. ఇప్ప‌టిదాకా ఈ రికార్డును మ‌రో హీరో అందుకోలేదు.

స‌రిలేరు నీకెవ్వ‌రు


మ‌హేశ్ లేటెస్ట్ ఫిల్మ్ 'స‌రిలేరు నీకెవ్వ‌రు' ఆయ‌న కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ గ్రాస‌ర్‌. ఇది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ. 230 కోట్లు వ‌సూలు చేసింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయ‌గా, 2020 జ‌న‌వ‌రిలో విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని అమితంగా ఎంట‌ర్‌టైన్ చేసింది. ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌.

భ‌ర‌త్ అనే నేను


కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా 2018లో విడుద‌లైంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ. 187 కోట్లు వ‌సూలు చేసి, మ‌హేశ్ కెరీర్‌లోని అతి పెద్ద హిట్ల‌లో ఒక‌టిగా పేరు తెచ్చుకుంది. ఇందులో ఆయ‌న జోడీగా కియారా అద్వానీ న‌టించింది.

మ‌హ‌ర్షి


2019లో విడుద‌లైన ఈ సినిమాలో మ‌హేశ్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా మెరిసింది. వంశీ పైడిప‌ల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తం రూ. 187 కోట్లు వ‌సూలు చేసింది. వివిధ కేట‌గిరీల్లో ప‌లు అవార్డుల‌ను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. రెండు నేష‌న‌ల్ అవార్డ్స్ సాధించింది.

శ్రీ‌మంతుడు


యాక్ష‌న్ డ్రామా 'శ్రీ‌మంతుడు' 2015లో విడుద‌లై మ‌హేశ్ కెరీర్‌లో అప్ప‌టికి బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రుతి హాస‌న్ నాయిక‌. బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 160 కోట్లు వ‌సూలు చేసిన ఈ సినిమా విడుద‌ల‌య్యాక సైకిల్‌పై తిర‌గ‌డం ఓ ఫ్యాష‌న్ అయ్యింది.

స్పైడ‌ర్‌


డిజాస్ట‌ర్‌గా ట్రేడ్ నిపుణులు తేల్చిన సినిమా 'స్పైడ‌ర్‌'. 2017లో విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ. 150 కోట్లు వ‌సూలు చేసింది. అయిన‌ప్ప‌టికీ బ‌య్య‌ర్లంద‌రికీ న‌ష్టాలు మిగిల్చింది. ఎ.ఆర్‌. మురుగ‌దాస్ రూపొందించిన ఈ సినిమాలో ర‌కుల్‌ప్రీత్ సింగ్ నాయిక‌.

దూకుడు


శ్రీ‌ను వైట్ల డైరెక్ట్ చేసిన 'దూకుడు' 2011లో విడుద‌లై, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ. 101 కోట్ల‌ను రాబ‌ట్టింది. ఈ రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామాలో స‌మంత హీరోయిన్‌. మ‌హేశ్ కెరీర్‌లో అప్ప‌టికి హ‌య్యెస్ట్ గ్రాస‌ర్ ఇదే.

(ఈ వ‌సూళ్లు ఐఎండీబీ లెక్క‌ల ప్ర‌కారం)

రూ. 100 కోట్ల క్ల‌బ్బులో 6 సినిమాలు.. టాలీవుడ్ నుంచి ఒకే 'ఒక్క‌డు'!