English | Telugu

బ‌ర్త్ డే స్పెష‌ల్‌గా ఉద‌య్ కిర‌ణ్ ఆఖ‌రి చిత్రం

ల‌వ‌ర్ బోయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉద‌య్ కిర‌ణ్‌.. గ‌తేడాది ఆక‌స్మికంగా మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. చ‌నిపోవ‌డానికి ముందు ఆయ‌న న‌టించిన ఓ సినిమా అతి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 'చిత్రం చెప్పిన క‌థ' పేరుతో తెర‌కెక్కిన ఈ మూవీని జూన్ 26న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. విశేష‌మేమిటంటే.. అదే రోజు ఉద‌య్ కిర‌ణ్ బ‌ర్త్‌డే కావ‌డం. మ‌రి.. బ‌ర్త్ డే గిఫ్ట్‌గా వ‌స్తున్న ఉద‌య్ కిర‌ణ్ చివ‌రి చిత్రం అభిమానుల‌ను అల‌రిస్తుందో లేదో చూడాలి. మోహ‌న్ ఆల్ర్‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అమరనేని నరేష్ అందించగా మున్నా కాశి సంగీత‌మందించారు. ప్ర‌స్తావించిద‌గ్గ మ‌రో విష‌య‌మేమిటంటే.. ఉద‌య్ మొద‌టి సినిమా 'చిత్రం' జూన్ నెల‌లో విడుద‌లైతే చివ‌రి సినిమా 'చిత్రం చెప్పిన క‌థ‌' కూడా అదే నెల‌లో రిలీజ్ కానుండ‌డం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.