English | Telugu

కిష్కింధపురి పై చిరంజీవి వీడియో రివ్యూ వైరల్

మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)ప్రస్తుతం 'అనిల్ రావిపూడి'(Anil ravipudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana shankara Vara Prasad)అనే చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 'అనిల్ రావిపూడి' నుంచి మరోసారి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ అంశాలతో తెరకెక్కుతున్న మూవీ కావడం, చిరంజీవి మాస్ ఇమేజ్ అందుకు తోడయ్యి, టోటల్ గా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ అంశాలతో నెక్స్ట్ సంక్రాంతికి వస్తుంది. చిరంజీవి కూతురు సుస్మిత తో కలిసి షైన్ క్రియేషన్స్ పై గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ' తో 'భగవంత్ కేసరి' ని నిర్మించిన 'సాహు గారపాటి నిర్మిస్తున్నాడు

చిరంజీవి రీసెంట్ గా ఈ నెల 12 న విడుదలైన 'కిష్కిందపురి'(Kishkindhapuri)మూవీ గురించి ఒక వీడియో రిలీజ్ చేసాడు. అందులో ఆయన మాట్లాడుతు కిష్కింధపురి నన్ను ఎంతగానో అలరించింది. హర్రర్ సినిమాగానే కాకుండా సైకలాజికల్ గా దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి చెప్పిన పాయింట్ చాలా బాగుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda sai Srinivas) అనుపమ మంచి నటన కనబరిచారు. చైతన్ భరద్వాజ్ సంగీతం కూడా మెప్పించింది. 'మన శంకర వరప్రసాద్ గారుని నిర్మిస్తున్న 'సాహు గారపాటి'(Sahu Gaarapati)మంచి ప్రయత్నం అందించారు. తప్పకుండా ప్రతీ ఒక్కరూ థియేటర్స్ లో చూడండి అంటూ మెగాస్టార్ సూచించారు. మెగాస్టార్ వీడియో రివ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది.

హర్రర్ మిస్టరీ థిల్లర్ గా, సరికొత్త కథాంశాలతో తెరకెక్కిన 'కిష్కింధపురి' రోజు రోజుకి ప్రేక్షకుల సంఖ్యని పెంచుకుంటు బాక్స్ ఆఫీస్ వద్ద తన చాటుతుంది. ఇందుకు ఆ చిత్రం సాధిస్తున్న కల్లెక్షన్స్ నే ఉదాహరణ. సాండీ, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, మకరంద్ దేశ్ పాండే తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.