English | Telugu

మెగాస్టార్ కత్తి ఆగిందా..?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా పరిస్థితి కూడా సినిమా కథలా తయారైంది.ఒకసారి కథ లేదని, ఇంకోసారి కథ దొరికిందని, మరోసారి రీమేక్ అని, ఇలా రకరకాల ఊహాగానాలు చిరు రీఎంట్రీ చుట్టూ తిరుగుతున్నాయి. లేటెస్ట్ గా, చిరు 150 చిత్రంగా కత్తిని తీయట్లేదని రూమర్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. స్టోరీ ప్రకారం, కత్తిలో హీరో పాత్రలు రెండుంటాయి. రెండింటిలో ఒకటి చాలా మంచివాడి పాత్ర. మరొకటి దొంగోడి పాత్ర. తనకున్న ఇమేజ్, పొలిటికల్ స్టాటస్ బట్టి చూస్తే, అలాంటి పాత్ర తనకు సెట్ కాదేమోనని చిరు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే ఈ పాత్రను తనకు తగ్గట్టుగా మార్చమని చిరు చెప్పినా, డైరెక్టర్ వినాయక్ మాత్రం సినిమా ఒరిజినాలిటీ దెబ్బ తింటుందని భయపడుతున్నారట. కత్తి స్టోరీ ఇష్యూ కూడా సినిమాకు స్పీడ్ బ్రేకర్ లా మారింది. దీంతో ఇప్పుడు కత్తి రీమేక్ భవిష్యత్తు అయోమయంలో పడింది. మరో వైపు ప్రస్తుతం కూతురు శ్రీజ పెళ్లిపనుల్లో ఉండి, ప్రాజెక్ట్ ను మెగాస్టార్ పక్కన పెట్టారని, పెళ్లి అయిపోగానే, ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని కొంతమంది అంటున్నారు. మరి ఏది నిజమో, ఈ పెళ్లి హడావిడి ముగిసే వరకూ తెలియదు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.