English | Telugu

సరైనోడు ఆడియోకు చిరు వస్తున్నారా..?


అల్లు అర్జున్ సరైనోడు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మార్చి మూడోవారంలో విశాఖపట్టణంలో ఆడియో లాంఛ్ చేయబోతున్నామని మూవీ టీం ప్రకటించింది కూడా. లాంఛ్ కు మెగా స్టార్ చిరంజీవిని ఛీఫ్ గెస్ట్ గా పిలవాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన అందుబాటులో ఉన్న టైం ను ప్రకటించే ఉద్దేశంతో ఎగ్జాక్ట్ డేట్ ను ప్రకటించలేదు. ఆయన వచ్చే డేట్ బట్టి ఆడియో డేట్ ను కూడా ఫిక్స్ చేయబోతున్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ కూడా మూవీ టీం కి మంచి కిక్ ఇచ్చిందట. ఈ మూవీలో బన్నీ సరసన రకుల్ ప్రీత్, క్యాథరీన్ ట్రెసా హీరోయిన్లుగా చేస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నాడు. హీరో ఆది పినిశెట్టి, విలన్ క్యారెక్టర్ చేయడం విశేషం. ఏప్రిల్ 22న రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగరం సమాచారం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .