English | Telugu

'జ్యోతిలక్ష్మి' 'మంత్రం' వేస్తుందా?

ఎంత త్వరగా చుట్టేశామ్ అన్నది కాదు....మేటరుందా లేదన్నదే ముఖ్యం. గతంలో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకున్న పూరీ జగన్నాధ్ ఈ మధ్య ఆ మాటే మరిచాడు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు చార్మి జ్యోతిలక్ష్మిపై పడేట్టుంది. ఎందుకంటే మూడేళ్ల క్రితం వచ్చిన బిజినెస్ మెన్ తర్వాత మళ్లీ పూరి హిట్టు మొహమే చూడలేదు. అయినా మూడంటే మూడు నెలలే అంటూ చకచకా షూటింగ్ పూర్తిచేసేసి థియేటర్లలో సినిమా వదిలేస్తున్నాడు. అరడజనుకు పైగా సినిమాలు ఇలా విడుదల చేసే దెబ్బతిన్నాడు. అయినా ఆలోచించడం లేదు. లెటెస్ట్ గా ఫేడవుట్ అయిపోయిన ఛార్మిపై మనసుపడ్డ పూరీ....అమ్మడితో హాట్ హాట్ గా జ్యోతిలక్ష్మి తెరకెక్కించాడు. బుధవారంలో గుమ్మడికాయ కూడా కొట్టేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ప్రమోషన్ కూడా త్వరలోనే పూర్తిచేసేసి....మే నెలాఖరుకి సినిమా విడుదల చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. దీంతో అంత కంగారేల అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరుస ఫ్లాపులిచ్చినా... ప్రేక్షకులకి పూరీపై అంతో ఇంతో నమ్మకం ఉండేది....కానీ... ఈ మధ్య ఆ నమ్మకం కాస్త సన్నగిల్లుతోంది. ఆ ఎఫెక్ట్ జ్యోతిలక్ష్మిపై పడేట్టుంది కూడా. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని సినిమా విడుదల చేస్తే మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఫ్లాప్ అయితే పూరీ కన్నా ఛార్మీకే కష్టాలెక్కువ. మరి జ్యోతిలక్ష్మితో మంత్రం వేయాలనుకుంటున్న ఛార్మి కోరిక నెరవేరుతుందా?

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.