English | Telugu

సెన్సార్ బోర్డులో పైరసీ దొంగలు

ప్రేమమ్ సినిమా మలయాళంలో గత నెల విడుదలై సంచలన విజయం సాధించింది. కానీ కొన్ని రోజులకే పైరసీ డీవీడీ క్వాలిటీతో సినిమా ప్రింట్ వచ్చేయడంతో నిర్మాతలు షాకయ్యారు. దీని మీద పెద్ద గొడవే జరిగిందక్కడ. బాహుబలి ఒక రోజు ఆలస్యంగా విడుదలవడానికి కూడా ఇదే కారణం. ఐతే సెన్సార్ బోర్డు సభ్యులే సినిమాను పైరసీ చేసినట్లు తేలడం విస్మయం కలిగిస్తోంది. ఈ విషయంలో నిర్మాతతో పాటు మలయాళ ఇండస్ట్రీ కూడా కదలడంతో వ్యవహారం బాగా సీరియస్ అయింది. పైరసీకి పాల్పడ్డ సెన్సార్ బోర్డు ఉద్యోగులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు కూడా. వారిపై తీవ్ర చర్యలు తీసుకునేదాకా వదిలే ప్రసక్తే లేదని.. ఇంకెవ్వరూ ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా శిక్షించాలని నిర్మాత అంటున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.