English | Telugu

శరత్ కుమార్ పై హీరో విశాల్ పోలీస్ కంప్లైంట్

రాధిక భర్త, నటుడు శరత్ కుమార్ పై విశాల్ పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. వివరాల్లోకి వెళితే, నడిగర్ సంఘం ఎన్నికలు వివాదాస్పదంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో హీరో విశాల్ వర్గం గెలుపొందారు. ఎన్నికలు ముగిసినా, రెండు వర్గాల మధ్య పోరు ఆగలేదు. తాజాగా, గతంలో నడిగర్ అధ్యక్షుడిగా చేసిన శరత్ కుమార్, అవినీతికి పాల్పడ్డారంటూ కొత్త కార్యవర్గ సభ్యులు చెన్నై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

నడిగర్ సంఘం పద్దుల లెక్కలు తమకు అప్పజెప్పలేదని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా, పట్టించుకోలేదని విశాల్ వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో గత బుధవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో, శరత్ కుమార్ పై కంప్లైంట్ చేయాలని, సభ్యులంతా డిసైడ్ అయ్యారు. గత కార్యవర్గ సభ్యులైన శరత్ కుమార్, రాథారవి తో పాటు మిగిలిన వారు కూడా కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో వైపు శరత్ కుమార్ మాత్రం, తాను లెక్కలన్నీ అప్పజెప్పానని, అయినా కానీ కుట్ర చేసి, తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నడిగర్ సంఘం గొడవలతో, కోలీవుడ్ వాతావరణం వేడెక్కింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.