English | Telugu

బన్నీ వాసు ట్వీట్‌తో ఇండస్ట్రీలో కలకలం.. ఇంతకీ ఏమన్నాడు?

అల్లు అర్జున్‌ కాంపౌండ్‌లో బన్నీ వాసు కీలకమైన వ్యక్తి అనే విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్‌కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ కేర్‌ తీసుకుంటూ బన్నీ వాసుగా స్థిరపడ్డాడు. ఇక నిర్మాతగా ఎన్నో విజయాలు సాధించాడు. మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నాడు. నిర్మాతగానే కాకుండా గోదావరి జిల్లాలో జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఇటీవల నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నిర్మించిన ‘తండేల్‌’ చిత్రం సూపర్‌హిట్‌ అయి 100 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో తండేల్‌ చిత్రం పైరసీపై మీడియాలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఓ ట్వీట్‌తో మరోసారి వార్తల్లోకి వచ్చారు వాసు. ‘ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్‌ అవ్వాలని ఉంది.. అలాగే ఎందుకిప్పుడు గొడవలు అని కూడా ఉంది.. శాంతి.. శాంతి.. శాంతి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీన్ని అందరూ షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. బన్నీవాసు పెట్టిన ట్వీట్‌పై మరో నిర్మాత ఎస్‌కెఎన్‌ సోషల్‌ మీడియా ద్వారానే స్పందిస్తూ ‘అవ్వాలి అనిపిస్తే అయిపోవడమే.. తర్వాత సంగతి తర్వాత’ అంటూ ట్వీట్‌ చేశాడు.

అసలు బన్నీ వాసు అలా ఎందుకు ట్వీట్‌ చేశాడు. దానికి ఎస్‌కెఎన్‌ ఎందుకలా స్పందించాడు అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బన్నీవాసు ఎవరిని ఉద్దేశించి అలా ట్వీట్‌ చేశాడు అని ఇండస్ట్రీలోని కొందరు టెన్షన్‌ పడుతున్నారు. అతను ఏ విషయం మీద గట్టిగా మాట్లాడాలి అనుకుంటున్నాడనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇండస్ట్రీలోని ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడా అనే సందేహం చాలా మందిలో వ్యక్తమవుతోంది. కొన్ని వివాదాస్పద అంశాలకు దూరంగానే ఉండే వాసు.. ఇలాంటి ట్వీట్‌ చేయడం వెనుక కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కొంతకాలం వెయిట్‌ చెయ్యక తప్పదు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.