English | Telugu

అప్పుడే ఓటీటీలోకి 'భగవంత్ కేసరి'

నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని, సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. 11 రోజుల్లోనే ఈ చిత్రం రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు న్యూస్ వినిపిస్తోంది.

'భగవంత్ కేసరి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 23 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే థియేటర్లలో విడుదలైన సరిగ్గా ఐదు వారాలకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందన్నమాట. ఓటీటీలోకి రావడానికి ఇంకా మూడు వారాల సమయముంది. మరి ఈలోపు 'భగవంత్ కేసరి' బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.