English | Telugu

బాల‌య్య‌, ఎన్టీఆర్ క‌లుస్తున్నారోచ్‌!

నంద‌మూరి అభిమానుల‌కు ఇంత‌కంటే శుభ‌వార్త ఏముంటుంది.?? అటు బాల‌య్య‌, ఇటు ఎన్టీఆర్ వాళ్ల‌కు రెండు క‌ళ్లు. వీరిద్ద‌రూ గ‌త కొంతకాలంగా ఎడ‌మెహం, పెడ‌మొహంగా ఉంటున్నారు. ఎట్ట‌కేల‌కు వీరిద్ద‌రు క‌ల‌వ‌బోతున్నారు. అదెలాగంటారా..?? హుద్ హుద్ బాధితుల‌కు బాస‌ట‌గా నిల‌వ‌డానికి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ `మేము సైతం` అనే ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌బోతోంది. తెలుగు సినీరంగ‌మంతా ఏక‌మై, వినోద కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించ‌బోతోంది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా స‌మ‌కూరే ఆదాయాన్ని హుద్ హుద్ బాధితుల‌కు విరాళంగా ఇవ్వ‌బోతోంది. అగ్ర హీరోలు, కొత్త - పాత‌త‌రం న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంతా ఈ వినోద కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోబోతున్నారు. న‌లుగురైదుగురు న‌టులు క‌ల‌సి ఓ స్కిట్ వేయ‌బోతున్నార‌ట‌. ఇలా క‌నీసం ప‌ది స్కిట్లు వేసి, ప్రేక్ష‌కులకు వినోదం పంచ‌బోతున్నార‌ని తెలిసింది. ఓ స్కిట్‌లో నంద‌మూరి హీరోలు క‌లసి న‌టించే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్ టాక్‌. ఈ స్కిట్లో బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌లు కూడా న‌టిస్తార‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే... అభిమానుల‌కు కనుల పండ‌గే!! వీరిద్ద‌రినీ ఎలాగైనా ఒప్పించి ఓ స్కిట్ వేయించాల‌ని ''మా'' విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.