English | Telugu

‘బాహుబలి’ లీక్... రాజమౌళి కేస్...

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడా.. ఇంకెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బాహుబలి’ సినిమా విడుదలైంది. కాకపోతే థియేటర్లలో కాదు... ఇంటర్నెట్‌లో! ‘బాహుబలి’ సినిమాకి సంబంధించిన 13 నిమిషాల ఫుటేజ్ ఈమధ్య యూట్యూబ్‌, ఫేస్‌బుక్, వాట్సప్‌లో విడుదలైంది. మూడు రోజులుగా ఈ ఫుటేజ్ నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకి పనిచేసిన సిబ్బంది ఎవరో ఈ ఫుటేజ్‌ని లీక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడు రాజమౌళి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ సిబ్బంది మీదే అనుమానాలు వున్నాయని ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ఆ సినిమాకి పనిచేసిన సిబ్బంది పదిమందిని పోలీసులు విచారించారు. ‘బాహుబలి’ ఫుటేజ్ ఎడిటింగ్ చేసినదే లీక్ అయింది. కాబట్టి అది ఎడిట్ సూట్ నుంచే బయటకి వచ్చిందన్న అనుమానాలున్నాయి. బయటకు రావాలి. దాంతోఎడిట్ సూట్లో ఉన్నవారిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.