English | Telugu

బాహుబ‌లికి 'వందే'సిన జక్క‌న్న‌

మా సినిమా ఇంత వ‌సూలు చేస్తుంది, ఇన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంది.. అంటూ ముందే లెక్క‌లు బ‌య‌ట‌పెట్ట‌డానికి చాలా ధైర్యం, త‌మ సినిమాపై బోల్డంత న‌మ్మ‌కం కావాలి. సినిమాని ఓ య‌జ్ఞంలా భావించి, ఆహోరాత్రులు క‌ష్ట‌ప‌డి, త‌న క‌థ‌ని వెండితెర‌పై రంగుల హ‌రివిల్లులా ఆవిష్క‌రించే రాజ‌మౌళి మాత్రం ఎప్పుడూ గొప్ప‌లు పోలేదు. మంచి సినిమా తీశాం.... చూడండి అంటాడంతే. అయితే తొలిసారి రాజ‌మౌళి త‌న సినిమా సాధించే రికార్డుల గురించి క‌ల‌లుకంటున్నాడు. బాహాటంగానే చెప్పేస్తున్నాడు. ''బాహుబ‌లి తెలుగులో వంద కోట్లు సాధించి తీరుతుంది'' అంటూ ఓ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చి... అంద‌రికీ షాక్ ఇచ్చాడు రాజ‌మౌళి. బాహుబ‌లి సినిమా ఎంత వ‌సూలు చేస్తుంది? అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో ఎదురైన ప్ర‌శ్న‌కు రాజ‌మౌళి ఇలా స్పందించాల్సివ‌చ్చింది. సాధార‌ణంగా ఇలాంటి విష‌యాల్ని బ‌య‌ట‌చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డని రాజ‌మౌళి 'వంద కోట్లు ఖాయం' అనేస‌రికి... చిత్ర‌సీమ షాక్ తింది. రాజ‌మౌళి న‌మ్మ‌కానికి ఓ భారీ రీజ‌న్ ఉంది లెండి. బాహుబ‌లి సినిమాని తెలుగు రాష్ట్ర్రాల్లో ఏకంగా రెండు వేల థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నారు. అనుకొన్న ప్లాన్ ప్ర‌కారం.. అన్నీ వ‌ర్క‌వుట్ అయితే.. తొలి మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల‌కు పైనే వ‌సూళ్లు రాబ‌ట్టే అవ‌కాశం ఉంది. రాజ‌మౌళి ధీమా అదే! అదే జోరు తొలివారం కొన‌సాగితే.. బాహుబ‌లి వంద చేరు కోవ‌డం ఖాయం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.