English | Telugu

ఇండియాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ ఫిల్మ్ గా 'అవతార్-2'!

'అవతార్'కి సీక్వెల్ గా జేమ్స్ కామెరాన్ రూపొందించిన విజువల్ వండర్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ఇండియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 16న విడుదలైన ఈ చిత్రం మూడు వారాల తర్వాత కూడా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు చూపిస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ చిత్రంగా నిలవడం విశేషం.

2019లో విడుదలైన 'అవెంజర్స్: ఎండ్ గేమ్' రూ.438 కోట్ల గ్రాస్ తో ఇండియాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ మూవీగా సత్తా చాటగా.. ఇప్పుడు ఆ రికార్డుని 'అవతార్-2' బ్రేక్ చేసింది. ఇప్పటికే ఇండియాలో రూ.454 కోట్ల గ్రాస్ రాబట్టిన 'అవతార్-2' ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఫుల్ రన్ లో రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరినా ఆశ్చర్యంలేదని అంటున్నారు.

'అవతార్-2' తెలుగునాట కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.