English | Telugu

నవంబర్‌ 7న యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ‘జైహింద్‌ 2’

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరోగా శ్రీరామ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘జైహింద్‌2’. సుర్విన్‌ చావ్లా, చార్లెట్‌ క్లారి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 7న విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా హీరో, దర్శకనిర్మాత అర్జున్‌ మాట్లాడుతూ ` ‘‘ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్‌ 7న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకు చాలా మంచి స్పందన వస్తోంది. అర్జున్‌ జన్యా చాలా మంచి మ్యూజిక్‌ అందించారు. టెక్నికల్‌గా ఈ చిత్రాన్ని చాలా హై స్టాండర్డ్స్‌లో చేశాము. ఫైట్స్‌ విషయానికి వస్తే నా గత చిత్రాల ఫైట్స్‌ అన్నీ ఒక వైపుంటే ఈ సినిమా ఫైట్స్‌ మరో వైపు నిలుస్తాయి. ఈ సినిమాలో ఎమోషనల్‌ క్యారెక్టర్‌ చేశాను. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, బ్యాంకాక్‌, సింగపూర్‌, యు.కె దేశాల్లో ఈ సినిమాని చిత్రీకరించాం. ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌పై రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

బ్రహ్మానందం, అలీ, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, షఫీ, అమిత్‌ కుమార్‌ తివారీ, వినయ్‌ ప్రసాద్‌, రవికాలే తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఎడిటర్‌: కె.కె, ఆర్ట్‌: శశిధర్‌ అడప, సహనిర్మాతలు: ఐశ్వర్య, అంజన, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: అర్జున్‌.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.