English | Telugu

స‌మంత‌తో విజ‌య్ కెమిస్ట్రీ మాములుగా లేద‌స‌లు.. 'ఖుషి' సెకండ్ సింగిల్ 'ఆరాధ్య' రివ్యూ

"నా రోజా నువ్వే.." అంటూ రెండు నెల‌ల క్రితం ఫ‌స్ట్ సింగిల్ తో మ్యూజిక్ ల‌వ‌ర్స్ ని ఫుల్ ఖుష్ చేసేసిన 'ఖుషి' టీమ్.. ఇప్పుడు 'ఆరాధ్య' అంటూ సెకండ్ సింగిల్ తో ప‌ల‌క‌రించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సమంత‌పై చిత్రీక‌రించిన ఈ పాట కూడా మెలోడీయ‌స్ గా సాగింది. చిత్ర ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ సాహిత్య‌మందించిన ఈ గీతానికి హేష‌మ్ అబ్దుల్ వ‌హ‌బ్ అందించిన బాణీ ఎంతో విన‌సొంపుగా ఉంది. ఇక సిద్ శ్రీ‌రామ్, చిన్మ‌యి గాత్రాలైతే పాట‌ని మ‌రో స్థాయికి తీసుకెళ్ళాయి. లిరిక‌ల్ వీడియోని బ‌ట్టి చూస్తే.. స‌మంత‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ కెమిస్ట్రీ మాములుగా లేద‌నే చెప్పాలి.

"ఆరాధ్య నా ఆరాధ్య‌.. నువ్వేలేనిదేది వ‌ద్దు ఆరాధ్య" అంటూ సాగే ఈ పాట‌లో "నా గుండెను మొత్తం తవ్వి త‌వ్వి చంద‌న‌మంతా చ‌ల్ల‌గా దోచావే" వంటి వాక్యాలు భ‌లేగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఓవ‌రాల్ గా.. 'ఖుషి" నుంచి వ‌చ్చిన తొలి రెండు గీతాలు కూడా చార్ట్ బ‌స్ట‌ర్స్ అనే చెప్పొచ్చు. మ‌రి.. మ్యూజిక‌ల్ గా మెస్మ‌రైజ్ చేస్తున్న 'ఖుషి' నుంచి త‌దుప‌రి రాబోయే పాట‌లు కూడా ఇదే స్థాయిలో ఆక‌ట్టుకుంటాయేమో చూడాలి.

మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై త‌యార‌వుతున్న 'ఖుషి'.. సెప్టెంబ‌ర్ 1న థియేట‌ర్స్ లోకి రానుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.