English | Telugu

ప‌వ‌న్, అనుష్క‌... కాంబో??

త్రివిక్ర‌మ్ ఇప్పుడు మ‌హేష్ బాబు కోసం స్ర్కిప్టు రాసుకొనే ప‌నిలో ఉన్నాడు. అయితే స‌మాంత‌రంగా `కోబ‌లి`కి సంబంధించిన చ‌ర్చ‌లూ సాగిస్తున్నాడ‌ట‌. మ‌హేష్ బాబు తో సినిమా పూర్త‌వ్వ‌గానే కోబ‌లిని ప్రారంభించాల‌ని ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌లు నిర్ణ‌యించుకొన్న‌ట్టు తెలిసింది. ఈ సినిమాలో క‌థానాయిక‌గా ఎవ‌రైతే బాగుంటారు? అనే విష‌యంపై కూడా ప‌వ‌న్, త్రివిక్ర‌మ్‌ల మ‌ధ్య చ‌ర్చ‌సాగింద‌ట‌. త్రివిక్ర‌మ్ ఛాయిస్‌లో ఉన్న నాయిక అనుష్క మాత్ర‌మేన‌ట‌. ఈ విష‌యాన్ని ప‌వ‌న్‌కీ చెప్పాడ‌ట‌. ప‌వ‌న్ కూడా అనుష్క విష‌యంలో సానుకూలంగా స్పందించిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ - అనుష్కల కాంబినేష‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ చూసే ఛాన్స్ ద‌క్క‌లేదు. మ‌రి ఆ అవ‌కాశం త్రివిక్ర‌మ్ క‌ల్పిస్తాడేమో చూడాలి. ఈ 2015 చివ‌ర్లో గానీ 2016 ప్రారంభంలోగానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సుంద‌ని తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.