English | Telugu
ఎక్స్పోజింగ్ చేయటం తేలిక కాదు: అనసూయ
Updated : Oct 30, 2023
బుల్లి తెరపై యాంకరింగ్, స్పెషల్ షోస్ అంటూ ఓ రేంజ్లో దుమ్ము దులిపి గ్లామర్ రంగులు అద్దిన అనసూయ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై బిజీగా ఉంటున్నారు. రంగస్థలం, పుష్ప ది రైజ్ నుంచి రీసెంట్గా వచ్చిన పెదకాపు వరకు పలు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనసూయ తన అభిమానులు, నెటిజన్స్ వేసే ప్రశ్నలకు సమాధానలిస్తుంటారు. ఒక్కోసారి అవి కాంట్రవర్సీలకు కూడా దారి తీస్తుంటాయి. అయినా కూడా అనసూయ సోషల్ మీడియాలో నెటిజన్స్తో ఎప్పుడూ టచ్లో ఉండటానికే ప్రయత్నిస్తుంటుంది.
తాజాగా మరోసారి అనసూయ నెటిజన్స్ కామెంట్స్కు రియాక్ట్ అయ్యింది. అదే ఇప్పుడు న్యూస్గా వైరల్ అవుతోంది. ఇంతకీ అనసూయ దేని కోసం మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారనే వివరాల్లోకి వెళితే, ఓ ప్రముక ఛానెల్లో ప్రోగ్రాం కోసం అలనాటి తారలు సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య వంటి నటించిన చిత్రాల్లోని కొన్ని పాటలను రీ క్రియేట్ చేయగా అందులో అనసూయ ఆయా హీరోయిన్ పాత్రలో కనిపించింది. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా పెర్ఫామెన్స్తో అలనాటి తారలకు నివాళి ఇచ్చే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని కామెంట్ కూడా పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్స్ కొందరు రియాక్ట్ అయ్యారు.
అయితే ఓ నెటిజన్ మాత్రం ఎక్స్పోజింగ్ చేసినంత తేలిక కాదు, సావిత్రిలా నటించటం అంటూ కామెంట్ పెట్టాడు. దానికి అనసూయ కూడా అదే స్టైల్లో రియాక్ట్ అయ్యింది. ‘‘సావిత్రమ్మలా చేయటం ఎవిరి తరం కాదు, నేను వారికి నివాళి ఇచ్చానంతే. అలాగే ఎక్స్పోజింగ్ చేయటం అంత తేలికేం కాదు. శారీరకంగా, మానసికంగా ఎంతో సన్నద్ధం కావాలి. ఏ పాత్ర చేసినా, ఏ డ్రెస్ వేసినా మన పనిని ధృడ సంకల్పంతో చేయాలి’’ అన్నారు అనసూయ.
