English | Telugu

అల్లరి నరేష్ ఆవిష్కరించిన 'టెర్రర్' ట్రైలర్

శ్రీకాంత్, నికితా జంటగా అఖండ భారత్ క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమా సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన సినిమా 'టెర్రర్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26న విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రైలర్ ని ఆవిష్కరించిన హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన హీరో శ్రీకాంత్ గారు. ఆయన నేను ఎప్పుడు కలిసిన సినిమాల గురించే మాట్లాడుకుంటాం. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువగా మాట్లాడింది టెర్రర్ సినిమా గురించే. ట్రైలర్ చాలా బాగుంది. ఆయన నటించిన ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలి. నిర్మాతకు మంచి లాభాలు రావాలి'' అని అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ''ఈ యూనిట్ తో వండర్ ఫుల్ జర్నీ చేశాను. స్క్రిప్ట్ నెరేషన్ విధానం నచ్చి సినిమా చేయడానికి రెడీ అయ్యాను. దర్శకుడు సతీష్ సినిమాను క్లీన్, నీట్ గా డైరెక్ట్ చేశారు. సాయికార్తీక్ అద్భుతమైన రీరికార్డింగ్ ఇచ్చాడు. ఖచ్చితంగా కమర్షియల్ గా సినిమా విజయం సాధిస్తుంది. నిర్మాత ఈ సినిమా సక్సెస్ తో మరిన్నిసినిమాలు చేయాలి '' అని అన్నారు.

నిర్మాత షేక్ మస్తాన్ మాట్లాడుతూ.. ''నేను ఇండస్ట్రీకి కొత్త. కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. శ్రీకాంత్ సహా నటీనటులు, డైరెక్టర్ సతీష్ గారు మిగతా టెక్నిషియన్స్ సపోర్ట్ తో మంచి సినిమా తీయగలిగాం'' అని అన్నారు.

దర్శకుడు సతీష్ కాశెట్టి మాట్లాడుతూ.. ''ఈకాలంలో సినిమా చేయడమనేది పెద్ద విషయం కాదు. కానీ సినిమాను రిలీజ్ చేయడం చాలా కష్టమైన విషయం. నిర్మాతగారు ఇచ్చిన సపోర్ట్ తో సినిమా విడుదలకు రెడీ అయ్యింది. సినిమా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.