English | Telugu

మీడియా అంటే భ‌య‌ప‌డుతున్న ముద్దుగుమ్మ‌లు

గ్లామ‌ర్ ప్ర‌పంచానికి `మీడియా` కావాలి... `మీడియా`కు గ్లామ‌ర్ ప్ర‌పంచం కావాలి. అందుకే ఈ రెండు రంగాలు ఇచ్చిపుచ్చుకొంటుంటాయి. మ‌రీ ముఖ్యంగా క‌థానాయిక‌లు `మీడియా` ముందు హొయ‌లుపోతుంటారు. ఫొటోగ్రాఫ‌ర్లు, కెమెరామెన్లు చుట్టుముడుతుంటే, పాత్రికేయులు త‌మ ఇంట‌ర్వ్యూల కోసం ప‌రుగులు తీస్తుంటే.. క్రేజ్ అనుకొంటుంటారు. మీడియా త‌మ‌కు దూర‌మ‌వుతుందంటే బెంగ పెట్టుకొంటారు. అలాంటిది కొంత‌మంది క‌థానాయిక‌లు మీడియా అంటే `అమ్మ‌బాబోయ్‌` అంటున్నారు. ఇంట‌ర్వ్యూల‌కు దూర‌మ‌య్యారు. `మ‌మ్మ‌ల్నిఈ ఛాన‌ళ్లు, ప్రెస్సూ క‌వ‌ర్ చేయ‌క‌పోతేనే మేలు` అనుకొంటున్నారు. అలాంటి వారిలో న‌య‌న‌తార‌, హ‌న్సిక‌. త్రిష‌, స‌మంత‌.. ఇలా చాలామందే ఉన్నారు.

పొగిడినంత కాలం క‌థానాయిక‌ల‌కు బాగానే ఉంటుంది. `అదంట క‌దా, ఇదంట క‌దా` అంటూ గాసిప్పులు రాస్తేనే వాళ్ల‌కు బాధొచ్చేస్తుంటుంది. ఇటీవ‌ల స‌మంత - త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌న్న ప్ర‌చారం ఊపందుకొంది. అవి చూసి స‌మంత తెగ గాభ‌రా ప‌డిపోయింద‌ట‌. `ఉన్న‌వీ లేనివీ ఎందుకు రాస్తారు.? దిస్ ఈజ్ టూ మ‌చ్‌` అంటూ ఆగ్ర‌హం వెల్లుబుచ్చింద‌ట‌. అందుకే ఇక నుంచి మీడియాకు వీలైనంత దూరంగా ఉండాల‌నుకొంటోంద‌ట‌.


ఇక న‌య‌న‌తార ముందు నుంచీ మీడియాకు దూరంగానే ఉంటోంది. ఈమ‌ధ్య అది మ‌రింత ఎక్కువైంది. ఓ త‌మిళ ద‌ర్శ‌కుడితో న‌య‌న ఎఫైర్ న‌డుపుతోంద‌ని, ఇద్ద‌రికీ ర‌హ‌స్యంగా పెళ్ల‌యిపోయింది గుస‌గుస‌లు వినిపించాయి. ఇద్ద‌రూ మ‌రీ టూమ‌చ్ క్లోజ్ గా ఉన్న ఓ సెల్ఫీ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాంతో... లేనిపోని అనుమానాలు మొద‌ల‌య్యాయి. తాను ఎదురైతే మీడియా ఈ విష‌యాల‌పై ఎక్క‌డ గుచ్చి గుచ్చి అడుగుతుందో అని న‌య‌న భ‌య‌ప‌డుతోంది.



హ‌న్సిక మీడియాతో కాస్త ఫ్రెండ్లీగానే ఉండేది. ఇప్పుడు త‌ను కూడా `నో మీడియా` అంటోంది. ఎందుకంటే ఇటీవ‌ల అమ్మ‌డి సెల్పీలు కొన్ని బ‌య‌ట‌ప‌డ్డాయిలెండి. అందులో స‌గం న్యూడ్‌గా క‌నిపించింది. ఆ సెల్పీలు మీవేనా అని అడుగుతార‌ని ఆమె భ‌యం. దాంతో పాటు శింబుతో న‌డుపుతున్న ల‌వ్ ఎఫైర్ గురించీ మాట్లాడాల్సివ‌స్తుంద‌ని కంగారు ప‌డుతోంది. త్రిష కూడా అంతే. వ‌రుణ్తో ఎందుకు విడిపోయిందో చెప్పాల్సివ‌స్తుంద‌ని మీడియాకు వీలైనంత దూరంగా ఉంటోంది.

క‌థానాయిక‌ల అందాల్ని, వాళ్ల విజ‌యాల్ని పొగిడినంత కాలం.. వీళ్లంద‌రికీ మీడియా కావ‌ల్సివ‌చ్చింది. ఎప్పుడైతే.. వ్య‌క్తిగ‌త జీవితాల్లో మీడియా తొంగిచూడడం మొద‌లెట్టిందో వాటికి స‌మాధానాలు చెప్పాల్సివ‌స్తుంద‌ని ఇలా మీడియాకు దూరంగా ఉంటున్నారు. మ‌రి వీళ్లంద‌రికీ ప్ర‌సార‌మాధ్య‌మాల‌పై క‌రుణ ఎప్ప‌టికి క‌లుగుతుందో..?

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.