English | Telugu

మేము ఓటు వేశాం... మరి మీరు..?

గ్రేటర్ ఎలక్షన్లలో సినీతారలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రజలందరూ కూడా ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.హీరోలు నాగార్జున, అల్లు అర్జున్, బాలకృష్ణ, ఎన్టీఆర్, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జున, అల్లుఅర్జున్ లు ఓటు వేయమని తమ అభిమానులకు ట్విట్టర్ లో కూడా పిలుపునివ్వడం విశేషం.' నేను ఓటు వేశాను మీరు కూడా వేయండి అని నాగార్జున ' ట్వీట్ చేస్తే, ' ఓటు వెయ్యని వాళ్లకు నాయకుల్ని ప్రశ్నించే హక్కు కూడా ఉండదు ' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు..

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.