English | Telugu

49లోకి అడుగుపెట్టిన 'మొజార్ట్ ఆఫ్ మద్రాస్'

ఇండియా నుంచి ఆల్ టైం బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్న ఎ.ఆర్ రెహమాన్ ఈ రోజు తన 49వ పుట్టిన రోజు వేడుకని జరుపుకోనున్నాడు. మణిరత్నం తీసిన ‘రోజా’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై తన మ్యూజిక్ తో అందరి ప్రశంశలు అందుకున్నాడు. వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ లో డిప్లమా చేసిన రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించడమే కాకుండా అద్భుతంగా పాటలు పాడగలడు. ఒకవైపు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేస్తూనే మరోవైపు సూపర్ హిట్ ఆల్బమ్స్ ని, మ్యూజిక్ వీడియోలను రూపొందించి మెప్పించాడు.

‘మొజార్ట్ ఆఫ్ మద్రాస్’, ‘ఇసై పుయల్’గా ముద్దుగా పిలవబడే రెహమాన్ ఎన్నో అవార్డులను,రివార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంతవరకు 4 నేషనల్ అవార్డులు,6 తమిళ నాడు స్టేట్ అవార్డ్స్,15 ఫిలింఫేర్ అవార్డ్స్ మరియు 13 సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు భారతప్రభుత్వం అందించే ‘పద్మశ్రీ’ ని,అలాగే 2009 లో ‘స్లగ్ డాగ్ మిలినియర్ ‘మూవీ కి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

తమిళ సినిమాలతో మొదలైన రెహమాన్ సంగీత ప్రయాణం అంతర్జాతీయ సినిమాలకు సంగీతం అందించే అవకాశాన్ని అతితక్కువ వ్యవధిలోనే దక్కించుకున్నాడు. ఇక తెలుగులో సూపర్ పోలీస్, నాని, ఏమాయ చేశావే,పులి వంటి సినిమాలకు సంగీతాన్ని అందించిన రెహమాన్ ఎక్కువగా తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం శంకర్-రజినీకాంత్ కాంబినేషన్ లో ‘చిట్టి 2.0’ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు రెహమాన్. అలాగే నిర్మాతగా సంగీత ప్రధానంగా ఒక సినిమాను నిర్మించబోతున్నట్లు టాక్. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే రెహమాన్ అందించనున్నాడట. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా వుండే రెహమాన్ తనవంతు బాధ్యతగా రెహమాన్ టీబీ వ్యాధి నిర్మూలనకు బ్రాండ్ అంబాసిడర్ గా,కొన్ని స్వచ్చంద సేవా సంస్థలకు అండగా నిలబడ్డాడు.

సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఏ.ఆర్.రెహమాన్ మరిన్ని మంచి సినిమాలకు సంగీతాన్ని అందించి, ఇలాగే ప్రేక్షకులను అలరిస్తూ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ తెలుగువన్.కామ్ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.