English | Telugu

‘టెంపర్‌’ షూటింగ్‌ పోస్ట్‌పోన్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘టెంపర్‌’ సినిమా షూటింగ్‌ పోస్ట్‌పోన్‌ చేశారు. ఎన్టీఆర్ సోదరుడు జానకీరామ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆయన తీవ్రంగా కలిచివేసింది. దీంతో కొద్ది రోజులు సినిమా షూటింగ్ లకి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని ఆయన తన సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్‌, బండ్ల గణేష్‌ లకు చెప్పడంతో, పరిస్థితిని అర్థం చేసుకున్న వారు పది రోజులపాటు షూటింగ్ ని వాయిదా వేశారు. తాజా పరిస్థితుల వల్ల ‘టెంపర్‌’ జనవరి 9న విడుదలవ్వడం కష్టమేనని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాలు మాత్రం పూరి జగన్నాథ్‌ స్పీడ్ కే సపోర్ట్ చేస్తున్నారు. సినిమాని అనుకున్న టైమ్‌లో, ఇంకాస్త ముందే ఫినిష్‌ చేయడంలో పూరి దిట్ట అని, ఎన్టీఆర్‌ సహకారంతో ‘టెంపర్‌’ని పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేస్తారని అంటున్నారు. అయితే పూరి ‘టెంపర్‌’ ని స్పీడ్ గా ఫినిష్ చేస్తాడా? లేక పోస్ట్‌పోన్‌ చేస్తాడా? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.