English | Telugu
ముంబై హీరోయిన్ విషయంలో భారీగా చేతులు మారిన డబ్బు...డీల్ ఎంత!
Updated : Aug 27, 2024
సినిమా రంగంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాలని నిత్యం ఎంతో మంది తారలు ఇండస్ట్రీలో అడుగుపెడుతుంటారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు ఆషా జెత్వానీ. తెలుగుతో పాటు కొన్ని హిందీ చిత్రాలలోను చేసింది. ఇప్పుడు ఈమెకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
ఆషా జెత్వానీ ప్రస్తుతం ముంబైలో ఉంటుంది. కృష్ణా జిల్లాకి చెందిన వైసీపి పార్టీ కి చెందిన ఒక అగ్ర నాయకుడు కుమారుడు ఆషా ని గతంలో ఒక పార్టీలో కలిసాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో లొంగ దూసుకొని కొన్నాళ్ళు చెట్టాపట్టా లేసుకొని తిరిగారు. ఇక ఆ తర్వాత తనని పెళ్లి చేసుకోవాలని సదరు వైసిపీ నాయకుడు కుమారుడు ని కోరింది. దాంతో మాట్లాడుకుందామని ఆషా ని విజయవాడకు పిలిపించాడు. ఆ తర్వాత ఒక గెస్ట్హౌస్లో బంధించి చిత్రహింసలకు గురిచేసినట్లు గా వార్తలు వస్తున్నాయి. ఇది నిజమని కొన్ని చానెల్స్ లో అధికారకంగా న్యూస్ కూడా వస్తుంది.
ఇక కొన్ని రోజుల క్రితం ప్రముఖ రాజకీయనాయకుడు, పారిశ్రామికవేత్త కుటుంబానికి చెందిన ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆషా కొన్నాళ్ల కిందట ముంబయిలో ఓ కేసు పెట్టినట్లు గా తెలుస్తోంది. దీంతో తన కొడుకుతో పెళ్లి ప్రతిపాదనను విరమించుకోవాలని ఆషా కి చెప్పి చూశాడట. అయినా సరే ఆమె వినకపోవడంతో బెజవాడ పిలిపించి వేధించినట్లుగా సదరు ఛానల్ పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ముంబయిలో సెటిల్ చేస్తే తన ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని భావించిన ఆ పారిశ్రామికవేత్త, గత వైసిపీ ప్రభుత్వ పెద్దలతో తనకున్న సన్నిహిత సంబంధాలరీత్యా వారి సాయం కోరినట్లు మరో ప్రచారం సైతం ఉంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరు అని,డీల్ ఇంతకీ మాట్లాడుకున్నారనే చర్చ అందరిలో మొదలయ్యింది.
