English | Telugu

వార్-2 వల్ల యశ్ రాజ్ ఫిలిమ్స్ కి ఎంత నష్టమో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం 'వార్-2'. ఎన్టీఆర్, హృతిక్ వంటి బిగ్ స్టార్స్ కలిసి నటించడం.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగం రూపొందిన సినిమా కావడంతో.. 'వార్-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆగస్టు 14న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్.. డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇప్పటిదాకా రూ.310 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో 400 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా చేస్తున్నాయి. అయితే 'వార్-2' సినిమా స్థాయికి, ఆ బడ్జెట్ కి.. ఆ వసూళ్లు సరిపోవు. అందుకే యశ్ రాజ్ ఫిలిమ్స్ కి భారీ నష్టం వచ్చిందని, కనీసం వంద కోట్లు నష్టపోయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది.

రెమ్యూనరేషన్స్ తో కలిపి 'వార్-2' మొత్తం బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు అయిందట. అయితే ఇందులో సగానికి పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే వచ్చినట్లు సమాచారం. డిజిటల్ రైట్స్ రూ.150 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.50 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.25 కోట్లతో.. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మొత్తం రూ.225 కోట్లు వచ్చాయట. ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలుగు స్టేట్స్ లో తప్ప మిగతా అన్ని చోట్లా సొంతంగా విడుదల చేసుకుంది యశ్ రాజ్ ఫిలిమ్స్. తెలుగు రైట్స్ ద్వారా రూ.80 కోట్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా రూ.120 కోట్ల షేర్ రాబట్టింది. అంటే థియేట్రికల్ ద్వారా రూ.200 కోట్లు వచ్చాయి. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలిపి వైఆర్ఎఫ్ కి మొత్తం రూ.425 కోట్లు వచ్చాయని అంచనా.

రూ.400 కోట్ల బడ్జెట్ ని బట్టి చూస్తే.. రూ.425 కోట్లు రికవర్ అయ్యాయి కాబట్టి.. యశ్ రాజ్ ఫిలిమ్స్ సేఫ్ జోన్ లో ఉన్నట్లే. అయితే తెలుగు రైట్స్ రూ.80 కోట్లకు తీసుకున్న నిర్మాత నాగవంశీ.. నష్టాలను చూడబోతున్నారు. దీంతో ఆయనకు రూ.22 కోట్లు రిటర్న్ ఇవ్వడానికి యశ్ రాజ్ ఫిలిమ్స్ ముందుకొచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఆ పరిహారంతో పాటు, సినిమా పబ్లిసిటీ ఖర్చులను కలుపుకుంటే.. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్వల్ప నష్టాలతోనే బయట పడినట్లు అంచనా. పైగా ఇటీవల వైఆర్ఎఫ్ నుంచి వచ్చిన 'సైయారా' అనే సినిమా ఏకంగా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టడంతో.. 'వార్-2' వల్ల వచ్చే స్వల్ప నష్టాలు ఆ సంస్థకు పెద్ద లెక్క కాదనే మాట వినిపిస్తోంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.