English | Telugu

మరో టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ తో ధనుష్ మూవీ!

తమిళ హీరో ధనుష్ తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. వేణు ఊడుగుల.

2018లో వచ్చిన 'నీదీ నాదీ ఒకే కథ'తో దర్శకుడిగా పరిచయమై.. మొదటి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్నాడు వేణు. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 2022లో తన రెండో సినిమా 'విరాట పర్వం'తో ప్రేక్షకులను పలకరించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర కాసులు మాత్రం కురిపించలేకపోయింది. 'విరాట పర్వం' వచ్చి మూడేళ్లు దాటినా ఇంతవరకు వేణు తన కొత్త సినిమాని ప్రకటించలేదు. మధ్యలో నాగచైతన్య, సూర్య వంటి హీరోల పేర్లు వినిపించాయి కానీ.. అందులో ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు దర్శకుడిగా వేణు మూడో సినిమా ఓకే అయినట్లు సమాచారం. వేణు చెప్పిన విభిన్న కథకు ధనుష్ ఇంప్రెస్ అయ్యాడట. ఈ ప్రాజెక్ట్ ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

దర్శకుడిగా మూడో సినిమాకి చాలా సమయం తీసుకున్న వేణు ఊడుగుల.. ఈ గ్యాప్ లో నిర్మాతగా మారడం విశేషం. ఈటీవీ విన్ తో కలిసి 'రాజు వెడ్స్ రాంబాయి' అనే సినిమాని ఆయన నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.