English | Telugu

ప‌వ‌న్‌ని దేవుడ్ని చేసేశాడు

త్రివిక్ర‌మ్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ మంచి మిత్రులు. ''నాకున్న ఆత్మీయ నేస్తం త్రివిక్ర‌మ్‌'' అంటూ ప‌వన్ కూడా ప‌లుసార్లు చెప్పాడు. అందుకే మెగా అభిమానులంతా 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి' ఆడియోకి ప‌వ‌న్ అతిథిగా వ‌స్తాడనుకొన్నారు. కానీ రాలేదు. ఎందుకు రాలేద‌న్న అనుమానాల్ని త్రివిక్ర‌మ్ ఈ ఆడియో ఫంక్ష‌న్ సాక్షిగా నివృత్తి చేశాడు. ఈ కార్య‌క్ర‌మంలో త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ ''ప‌వ‌న్‌తో ఇందాకే ఫోన్ లో మాట్లాడా. 'నేను రాలేద‌ని ఎవ‌రైనా అడిగితే ఏం చెబుతావ్‌' అని అడిగారాయ‌న‌. దీని కోసం వేరే డైలాగ్ రాసుకోవ‌డం ఎందుకు? నేను రాసిందే వాడేసుకొంటా. 'అమ్మ‌ని, దేవుడ్ని ర‌మ్మ‌ని పిల‌వ‌కూడ‌దు. చూడాల‌నుకొంటే మ‌న‌మే వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లాలి..' అన్నాను'' అన్నారు త్రివిక్ర‌మ్‌. అంటే... త్రివిక్ర‌మ్ దృష్టిలోనూ ప‌వ‌న్ దేవుడ‌న్న‌మాట‌. పాత డైలాగే వాడినా.. భ‌లే చెప్పాడు క‌దూ. మొత్తానికి ఈ ఒక్క‌మాట‌తోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల్ని మ‌ళ్లీ ప‌డేశాడు త్రివిక్ర‌మ్‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.