English | Telugu

జై హింద్.. 'ఆపరేషన్ సిందూర్'పై టాలీవుడ్ స్టార్స్ రియాక్షన్!

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన పైశాచిక దాడికి మనవాళ్ళు సరైన గుణపాఠం చెప్పారంటూ.. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (Operation Sindoor)

పలువురు సినీ ప్రముఖులు భారత్ సైన్యానికి మద్దతుగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. 'ఆపరేషన్ సిందూర్' ఫోటోని షేర్ చేసిన చిరంజీవి 'జై హింద్' అని రాసుకొచ్చారు. "న్యాయం జరుగుతోంది. జై హింద్" అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. "మన భారత సైన్యం యొక్క భద్రత మరియు బలం కోసం ప్రార్థిస్తున్నాను" అని జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చాడు. "పిరికి పహల్గామ్ టెర్రర్ దాడులకు సమాధానం ఆపరేషన్ సిందూర్." అని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశాడు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.