English | Telugu

సాఫ్ట్ వేర్ జీతాల కంటే సినీ కార్మికుల వేతనాలే ఎక్కువ.. తెలుగు నిర్మాతల ఆవేదన!

సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచకపోతే షూటింగ్స్ లో పాల్గొనబోమని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై సినీ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్.. ఇప్పటికే ఉన్న కనీస వేతనాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నామని తెలిపింది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొంది.

మరోవైపు నిర్మాతలు కూడా ఫెడరేషన్ కి ధీటైన జవాబు ఇస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే షూటింగ్ కోసం ఏకంగా ముంబై నుంచి సినీ కార్మికులను తీసుకొనివచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది మైత్రి. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ షూటింగ్ జరుగుతోంది. అయితే వేతనాల పెంపు డిమాండ్ తో తెలుగు సినీ కార్మికులు నేటి నుంచి బంద్ కు పిలుపునివ్వడంతో.. మైత్రి ఊహించనివిధంగా ముంబై నుండి కార్మికులను తెప్పించి షూటింగ్ నిర్వహిస్తోంది. దీనిపై తెలుగు సినీ కార్మికులు మండిపడుతున్నారు. మన కార్మికులు కష్టం హీరో పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.

ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ కూడా.. వేతనాల పెంపు డిమాండ్ తో కార్మికులు బంద్ కు పిలుపునివ్వడాన్ని తప్పుబట్టారు. సినీ కార్మికులకు బయట ఉన్న కార్మికుల కంటే ఎక్కువ పే చేస్తున్నామని, సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కంటే కూడా వీరికి వేతనాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

ఈ విషయంపై నిర్మాత SKN సైతం ఆవేదన వ్యక్తం చేశారు. "ఇప్పటికే ధియేటర్స్ కి ఆడియన్స్ దూరం. ఇప్పుడు అదనపు వేతనాల భారం. ఓటీటీ శాటిలైట్స్ అగమ్య గోచరం. పైరసీ పుండు మీద కారం.పేరుకే వినోద పరిశ్రమ.. నిర్మాతల శ్రమ విషాదమే" అని అన్నారు.

ఏది ఏమైనా వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా లేరని అర్థమవుతోంది. 30 శాతం అంటే మరీ ఎక్కువ అని.. 5-10 శాతం పెంపు అయితే సాధ్యమయ్యే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.