English | Telugu

టాలీవుడ్ కి కొత్త సెన్సార్ అధికారి వచ్చారు

తెలుగు ఇండస్ట్రీ వర్గాలలో ప్రస్తుతం కొంతమంది చాలా సంతోషంగా వున్నారు. ఈ సంతోషానికి కారణం ఏంటో తెలుసా.. హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మి స్థానంలో కొత్త అధికారి రావడమే. ఎందుకంటే ఇంతకాలం ఈమె వలన చాలా మంది సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు చాలా ఇబ్బందులు పడ్డారు. అనవసరపు కటింగులు, సరైన విధంగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టేదంటూ వార్తలు వినిపించాయి. ఈమె ప్రవర్తనపై మంచు ఫ్యామిలీ, రాంగోపాల్ వర్మ వంటి వారు విమర్శలు కూడా చేశారు. అయితే ఇపుడు ఈమె స్థానంలో విజయ్ కుమార్ రెడ్డిని నియమించారు. విజయ్ కుమార్ గతంలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ విభాగంలో అనేక కీలకమైన ఉన్నత పదవులు నిర్వర్తించారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.